న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించడంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఆంక్షల పేరుతో ఒలింపిక్స్ లాంటి మెగాఈవెంట్లో ఏ దేశం పట్ల అయినా వివక్ష చూపించకూడదని మంగళవారం ఓ ఆన్లైన్ మీడియా సమావేశంలో అన్నారు. ‘అథ్లెట్ల సన్నద్ధత, అవకాశాలపై ప్రభావం చూపే ఎలాంటి అంశాలనైనా ఉపేక్షించబోం. వారు మానసిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈసారి మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారన్న నమ్మకం ఉంది’ అని రిజిజు చెప్పారు.