న్యూఢిల్లీ: వన్డే క్రికెట్ వరల్డ్కప్ టోర్నమెంట్కు కామెంట్రీ(ICC Commentators) చెప్పే వారెవరో తెలిసిపోయింది. ఐసీసీ శుక్రవారం కామెంటరీ ప్యానెల్ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మ్యాచ్ రోజున ప్రీ మ్యాచ్ షో, ఇన్నింగ్స్ ఇంటర్వెల్ ప్రోగ్రామ్, పోస్టు మ్యాచ్ వార్మప్ కోసం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కవరేజీ ఇస్తారు. కామెంటరీ ప్యానెల్లో హేమాహేమీల పేర్లను చేర్చారు. షేన్ వాట్సన్, లీసా సలేకర్, రమీజ్ రాజా, రవిశాస్త్రి, ఆరన్ ఫించ్, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్లు ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు.
కామెంటరీ బాక్సు నుంచి కామెంట్రీ ఇచ్చే వారి జాబితాలో నసీర్ హుస్సేన్, ఇయాన్ స్మిత్, ఇయాన్ బిషప్లు ఉన్నారు. ఈ ముగ్గురూ 2019 వరల్డ్కప్లోనూ కామెంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు వకార్ యూనిస్, షాన్ పొలాక్, అంజుమ్ చోప్రా, మైకేల్ అథర్టన్లు .. కామెంట్రీ బాక్సు నుంచి లైవ్ యాక్షన్ ఇవ్వనున్నారు. సైమన్ డౌల్, బాంగ్వా, మంజ్రేకర్, మార్టిన్, దినేశ్ కార్తిక్, డిర్క్ నానిస్, శామ్యూల్ బద్రీ, అతర్ అలీ ఖాన్, రసల్ అర్నాల్డ్ లాంటి స్టార్స్ కూడా కామెంట్రీ స్టార్స్ లిస్టులో ఉన్నారు.
లీడింగ్ బ్రాడ్కాస్టర్స్ ప్యానల్లో హర్షా బోగలే, కాస్ నైడో, మార్క్ నికోలస్, నటాలి జర్మానోస్, మార్క్ హోవర్డ్, ఇయాన్ వార్డ్ ఉన్నారు. ఇండియా తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8వ తేదీ ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడనున్నది.
Some of the most recognisable voices in the game will call the #CWC23 in India 🎙https://t.co/FBuIziElPa
— ICC (@ICC) September 29, 2023