Rehan Ahmed : భారత పర్యటనలో రెండు ఓటములతో సిరీస్లో వెనకబడ్డ ఇంగ్లండ్(England)కు వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వైజాగ్ టెస్టు అనంతరం మోకాలి సర్జరీ కోసం అబుదాబీ నుంచి అతడు నేరుగా స్వదేశం వెళ్లాడు. ఇప్పుడు లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్(Rehan Ahmed) సైతం సొంత దేశానికి బయల్దేరనున్నాడు.
నాలుగో టెస్టుకు దూరమైన అతడు వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి వైదొలిగినట్టు 19 ఏండ్ల రెహాన్ వెల్లడించాడు. అయితే.. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది మాత్రం ఇంగ్లండ్ ప్రకటిచంలేదు. వ్యక్తిగత కారణాల వల్ల రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్కు వచ్చేస్తున్నాడు. అతడి స్థానంలో మరెవరినీ తీసుకోవడం లేదు అని శుక్రవారం ఇంగ్లండ్ బోర్డు స్పష్టం చేసింది. మూడు టెస్టుల్లో ఈ యువ స్పిన్నర్ 11 వికెట్లు పడగొట్టాడు.
Take care, @RehanAhmed__16 ❤️
Rehan Ahmed will return home for personal reasons.
He will not be returning to India and we will not be naming a replacement.
🇮🇳 #INDvENG 🏴 #EnglandCricket pic.twitter.com/T7SgSLYDhp
— England Cricket (@englandcricket) February 23, 2024
ఉప్పల్ టెస్టు విజయంతో సిరీస్ అరంభించిన స్టోక్స్ సేన.. ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్కోట్లో కంగుతిన్నది. భారత బౌలింగ్ దళం దెబ్బకు భారీ తేడాతో ఓటమిపాలైంది. దాంతో, రాంచీ టెస్టులో ఇంగ్లండ్ రెండు మార్పులు చేసింది. రెహాన్ స్థానంలో యువ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ను, మార్క్ వుడ్ బదులు ఓలీ రాబిన్సన్ను తీసుకుంది.