తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. అన్ని రంగాల్లో మిగతా రాష్ర్టాలను వెనుకకు నెడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ దేశానికి ఒక దిక్సూచిలా నిలుస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు అవుతున్న వేళ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో రంగం అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ప్రత్యేక రాష్ర్టాంగా ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహంచని రీతిలో సాగుతున్న అభివృద్ధిపై పలువురు క్రీడా ప్రముఖులు స్పందించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు కొల్లగొట్టి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన టెన్నిస్ క్వీన్ సానియామీర్జా, బాక్సింగ్ స్టార్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ దశాబ్ది ఉత్సవాలపై మాట్లాడారు.
దశాబ్ది ఉత్సవాల వేళ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్రం లో అంతా మంచి జరుగుతున్నది. అభివృద్ధి విషయంలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రం దూసుకెళుతున్నది. మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.
-సానియా మీర్జా, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్
గత పదేండ్ల కాలంలో తెలంగా ణ అద్భుత ప్రగతి సాధించింది. భవిష్యత్లోనూ ఇదే పంథాను కొనసాగాలని ఆశిస్తున్నాను. దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి. సీఎం కేసీఆర్ సూపర్ విజన్లో దేశంలో గొప్ప రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలి. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు
నిఖత్ జరీన్, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్
అన్ని రంగాల్లో అభివృద్ధితో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలుస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర వాసిగా చాలా గర్వంగా ఉంది. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కనివినీ ఎరుగని రీతిలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భాన రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు
మహమ్మద్ హుసాముద్దీన్, అంతర్జాతీయ బాక్సర్