బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చాలా నిదానంగా సాగుతోంది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), కేన్ విలియమ్సన్ (0) ఇద్దరూ పెవిలియన్ చేరారు. దాంతో కష్టాల్లో పడ్డ జట్టును రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 39/2 స్కోరుతో పవరప్లే ముగించిన సన్రైజర్స్.. 8 ఓవర్లు ముగిసే సరికి 50 పరుగులు చేసింది.