సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే విరాట్ కోహ్లీ (0) గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరడంతో.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాలకు ఎత్తుకున్న కెప్టెన్ డుప్లెసిస్ (73 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి పూర్తిగా సహకారం అందించిన రజత్ పటీదార్ (48) అర్ధశతకానికి రెండు పరుగుల దూరంలోనే పెవిలియన్ చేరినా.. మ్యాక్స్వెల్ (33) కూడా చూడచక్కని షాట్లతో అలరించాడు.
చివర్లో క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (8 బంతుల్లో 30 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో జగదీష్ సుచిత్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. కార్తీక్ త్యాగి ఒక వికెట్ తీసుకున్నాడు.