పవర్ప్లే ముగిసిన తర్వాతి ఓవర్లోనే రెండు కీలక వికెట్లుకోల్పోయిన బెంగళూరును వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన అతను.. తన స్పిన్తో యువ బ్యాటర్ పటీదార్ను బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన పటీదార్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో పది ఓవర్లలో 58 పరుగులే చేసిన బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇది అశ్విన్ కెరీర్లో 150వ ఐపీఎల్ వికెట్ కావడం గమనార్హం. ఆ తర్వాత మరోసారి 12వ ఓవర్లో బంతి అందుకున్న అశ్విన్.. సూయష్ ప్రభుదేశాయి (2)ని కూడా పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు కోహ్లీ (9), డుప్లెసిస్ (23), మ్యాక్స్వెల్ (0) వికెట్లను స్వల్ప వ్యవధిలోనే తీసుకున్న రాజస్థాన్బ బౌలర్లు.. జట్టుకు మంచి ఆరంభం అందించిన సంగతి తెలిసిందే.
Milestone 🚨 – 150 wickets in IPL for @ashwinravi99 👏👏#TATAIPL #RCBvRR pic.twitter.com/Heb56QIwtl
— IndianPremierLeague (@IPL) April 26, 2022