మొదటి మ్యాచులో ఘోరంగా విఫలమైన బెంగళూరు బౌలర్లు కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. వీరి ధాటికి కోల్కతా బ్యాటర్లు విలవిల్లాడారు. ఆరంభం నుంచి తడబడుతూనే ఉన్న కేకేఆర్ బ్యాటింగ్ లైనప్కు ఆకాష్ దీప్ తొలి షాకిచ్చాడు. వెంకటేశ్ అయ్యర్(9)ను పెవిలియన్ చేర్చాడు.
ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో రహానే (10) అవుటయ్యాడు. కాసేపటికి వానిందు హసరంగ అదరగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ (13), నునీల్ నరైన్ (12), షెల్డాన్ జాక్సన్ (0)ను వెనక్కు పంపాడు. మధ్యలో నితీష్ రాణా (10)ను కూడా ఆకాష్ దీప్ బుట్టలో వేసుకున్నాడు. తర్వాత బౌలింగ్కు వచ్చిన హర్షల్ పటేల్.. శామ్ బిల్లింగ్స్ (14), ఆండ్రీ రస్సెల్ (25)ను అవుట్ చేసి ఆర్సీబీకి మంచి బ్రేక్ ఇచ్చాడు.
ఆ తర్వాత టిమ్ సౌథీ (1)ని హసరంగ అవుట్ చేయగా.. ఉమేష్ యాదవ్ (18)ను ఆకాష్ దీప్ పెవిలియన్ పంపాడు. దీంతో కేకేఆర్ జట్టు పూర్తి ఓవర్లు ఆడకుండానే 18.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్లలో హసరంగ 4, ఆకాష్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
An exceptional performance from our bowlers to bowl out KKR for 1️⃣2️⃣8️⃣. 👏🏻👏🏻
Time for our batters to get the job done. 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvKKR pic.twitter.com/nI5dlMZgK8
— Royal Challengers Bangalore (@RCBTweets) March 30, 2022