ఐపీఎల్ కొత్త సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమితో మొదలుపెట్టింది. బ్యాటర్లు విజృంభించడంతో 200పైగా పరుగులు చేసినప్పటికీ.. బౌలర్లు తేలిపోవడంతో బెంగళూరు ఓడిపోయింది. అయినా సరే కోల్కతాతో జరిగే మ్యాచు కోసం జట్టులో ఎటువంటి మార్పులూ అక్కర్లేదని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు.
పంజాబ్తో మ్యాచులో బెంగళూరు జట్టు తమ బలమైన టీంతో బరిలో దిగిందని, కానీ బౌలర్ల తప్పిదాల వల్ల ఓడిపోయిందని చెప్పాడు. అలాగే కోల్కతా కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగితే మంచిదని సలహా ఇచ్చాడు. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్పై ప్రశంసలు కురిపించాడు.
‘‘అతను పూర్తయిన వస్తువు కాదు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ముందుకెళ్లే కొద్దీ అతను మెరుగవుతూనే ఉంటాడు’’ అని కితాబిచ్చాడు. అలాగే పేపర్పై కోల్కతా జట్టు బలంగా కనిపిస్తోందని, వాళ్లే ఈ మ్యాచ్లో ఫేవరెట్లా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అయితే బెంగళూరును కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్పాడు.
Dinesh Karthik talks about facing his former team, plans to sledge his friends, and more on @kreditbee presents Game Day. Watch now.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #RCBvKKR pic.twitter.com/lze6FUYEaT
— Royal Challengers Bangalore (@RCBTweets) March 30, 2022