పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మునుపటి తరహాలో కింగ్ కోహ్లీ (73) చెలరేగిపోయాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (44)తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. దాంతో 169 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెంగళూరు.. వికెట్లేమీ కోల్పోకుండానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది.
అయితే రషీద్ ఖాన్ తన బౌలింగ్తో మాయ చేయడంతో డుప్లెసిస్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కోహ్లీని కూడా రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ వేసిన బంతిని భారీ సిక్సర్గా మలిచిన కోహ్లీ.. తర్వాతి బంతిని కూడా ముందుకొచ్చి బౌండరీకి తరలించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని మిస్ అవడంతో సాహా స్టంప్ అవుట్ చేశాడు.
అయితే మూడో స్థానంలో వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ (18 బంతుల్లో 40 నాటౌట్) కూడా ధాటిగా ఆడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే బెంగళూరు విజయం సాధించింది. కోహ్లీ తన విశ్వరూపం చూపడంతో గుజరాత్ బౌలర్లంతా చేతులెత్తేశారు. ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే రెండు వికెట్లతో సత్తాచాటాడు.
ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్లో ముంబై చేతిలో ఢిల్లీ ఓడితే.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరినట్లే. ఏది ఏమైనా కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావడం మాత్రం బెంగళూరు అభిమానులను సంతోషంలో ముంచేసింది.
That's that from Match 67 as #RCB win by 8 wickets and are now 4th on the #TATAIPL Points Table.
Scorecard – https://t.co/TzcNzbrVwI #RCBvGT #TATAIPL pic.twitter.com/K7uz6q15qQ
— IndianPremierLeague (@IPL) May 19, 2022