IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ ఫ్రాంఛైజీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో కొత్త జెర్సీని విడుదల చేసింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(Faf du Plessis) న్యూ జెర్సీని లాంచ్ చేశారు. దీనిలో స్పెషల్ ఎంటంటే.. గోల్డెన్ కలర్ లోగో ఉంది. మిగతా డిజైన్, కలర్ అంతా మునపటి జెర్సీ మాదిరిగానే ఉంది. ఈ సందర్భంగా మాజీ విధ్వంసక ఆటగాళ్లు క్రిస్ గేల్ (17), ఏబీ డివిల్లియర్స్(333) జెర్సీలకు రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో తమ జెర్సీలపై గేల్, డివిల్లియర్స్ సంతకాలు చేశారు.
ఈ లెజెండరీ క్రికెటర్స్కు ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది. అంతేకాదు తమ జట్టుకు సేవలందించినందుకు వీళ్లకు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించింది. ఈ సందర్భంగా ‘మళ్లీ ఆర్సీబీకి ఆడతారా?’ అని వీళ్లను సరదాగా ఆడిగారు. అందుకు గేల్.. ‘నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. డివిల్లియర్స్ మాత్రం ‘ప్రస్తుతం టీమ్ చాలా బాగా ఉంది. ఈ టైమ్లో మేము జట్టులో సరిపోతామని అనుకోవడం లేదు’ అని తెలివిగా బదులిచ్చాడు.
పదహారో సీజన్ ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో గత సీజన్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ ఎదురుపడనున్నాయి. ఆర్సీబీ జట్టు ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్కు మరో ఆరు రోజులే ఉండడంతో ఆర్సీబీ ఆటగాళ్లు ప్రాక్టీస్ వేగం పెంచారు. పూర్తి స్క్వాడ్తో నిన్న చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ, మ్యాక్స్వెల్ భారీ షాట్లు ఆడారు. 15 సీజన్లలో కప్పు కొట్టలేకపోయిన ఆ జట్టు ఈసారైనా కల నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
Here a full look of RCB new Jersey ♥️pic.twitter.com/VqqIvIs0R2
— Ayush™ 🇮🇳🚩 (@vkkings007) March 26, 2023