చెన్నై: ఐపీఎల్ 16వ ఎడిషన్కు రంగం సిద్ధమవుతోంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ యేటి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి. అయితే ఆ మెగా టోర్నీ గురించి అన్ని జట్లు రెఢీ అవుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా సిద్ధమైంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో ఆ టీమ్ ఈసారి టైటిల్పై కన్నేసింది. అయితే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ధోనీ కాసేపు సరదాగా గడిపారు. స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే కుర్చీలకు ధోనీ పెయింటింగ్ వేశారు. పసుపు, బ్లూ రంగు కుర్చీలకు.. కలర్ క్యాన్లతో స్ప్రే కొట్టాడు.
“𝑫𝒆𝒇𝒊𝒏𝒊𝒕𝒆𝒍𝒚 𝒍𝒐𝒐𝒌𝒊𝒏𝒈 𝒀𝒆𝒍𝒍𝒐𝒗𝒆”
Anbuden Awaiting for April 3🦁💛 pic.twitter.com/eKp2IzGHfm— Chennai Super Kings (@ChennaiIPL) March 27, 2023
2019 తర్వాత తొలిసారి మళ్లీ చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. కుర్చీలకు పెయింట్ వేస్తున్న ధోనీ వీడియోను సీఎస్కే జట్టు తన ట్విట్టర్లో పోస్టు చేసింది. చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ ఏప్రిల్ 3వ తేదీన జరగనున్నది. అయితే టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై ఆడనున్నది. చిదంబరం స్టేడియంలో లక్నో జట్టుతో తొలిమ్యాచ్ జరుగుతుంది.
చెన్నై జట్టు షేర్ చేసిన ధోనీ వీడియోకు అతి తక్కువ సమయంలోనే రెండు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. సుమారు 15వేల మంది లైక్ చేశారు. ఇక ధోనీని మెచ్చుకుంటూ చాలా మంది ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.