అహ్మదాబాద్: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ముందుకొచ్చింది. ఆక్సిజన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం నిధులు సేకరించేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. దీనికి తోడు బెంగళూరు నగరంతో పాటు అవసరమైన చోట మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో ప్రత్యేకంగా తయారు చేసిన నీలి రంగు జెర్సీల్లో ఆర్సీబీ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. ఈ జెర్సీలను వేలం వేయడం ద్వారా కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు నిధులను సేకరిస్తామని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నాడు.