అహ్మదాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దయినట్లు వార్తలు వచ్చాయి. స్థానిక వార్తాసంస్థ ఆనంద్బజార్ పత్రిక కథనం ప్రకారం ప్రాక్టీస్తో పాటు మీడియా భేటీ రద్దు అయినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సూచనలతో ఆర్సీబీ తమ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేసుకుంది. ఇదిలా ఉంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) ప్రకటన మరోలా ఉంది. జీసీఏ చీఫ్ అనిల్ మాట్లాడుతూ ఎలాంటి ఉగ్రవాద ముప్పులేదని, తీవ్ర వేడి కారణంగా ప్రాక్టీస్ చేయలేదని పేర్కొన్నాడు.