అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు .. ఈయేటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ జట్టు కల ఫలించింది. అహ్మదాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్పై ఆర్సీబీ విజయం సాధించింది. ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి ఇవాళ ఆర్సీబీ క్రికెటర్లు బెంగుళూరుకు బయలుదేరారు. నరేంద్ర మోదీ స్టేడియం నుంచి ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
🚨 RCB Victory Parade in Bengaluru ‼️
This one’s for you, 12th Man Army.
For every cheer, every tear, every year.
𝐋𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐢𝐬 𝐑𝐨𝐲𝐚𝐥𝐭𝐲 𝐚𝐧𝐝 𝐭𝐨𝐝𝐚𝐲, 𝐭𝐡𝐞 𝐜𝐫𝐨𝐰𝐧 𝐢𝐬 𝐲𝐨𝐮𝐫𝐬.🏆More details soon… pic.twitter.com/fMWuCGkVWX
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 4, 2025
ఆర్సీబీ స్వంత పట్టణం .. కర్నాటకలోని బెంగుళూరులో ఇవాళ విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. విధాన సౌద రూట్లో ఆ ర్యాలీ ప్రారంభంకానున్నది. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలను ప్లేయర్లు కలుస్తారు. ఇక చిన్నస్వామి స్టేడియంలో సుమారు 50 వేల ప్రేక్షకుల మధ్య విక్టరీ పరేడ్ సంబరాలు జరగనున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్స్ర్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్స్టొన్ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.
బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్.. 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.