న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) గాయపడ్డ ప్లేయర్ల స్థానాలను భర్తీ చేస్తున్నది. ఇప్పటికే గాయాలతో సీజన్కు పూర్తిగా దూరమైన రెకీ టోప్లె, రజత్ పాటిదార్ స్థానాల్లో వెయిన్ పార్నెల్(దక్షిణాఫ్రికా), వైశాక్ విజయ్కుమార్ను జట్టుకు ఎంపిక చేసింది. తన కెరీర్లో 26 మ్యాచ్లాడిన లెఫ్టార్మ్ పేసర్ పార్నెల్ను ఆర్సీబీ రూ.75 లక్షలకు తీసుకోగా, దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న విజయ్కుమార్పై కనీస ధర రూ.20 లక్షలు వెచ్చించింది.