MI vs RCB : ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాల్లో పడింది. వెంట వెంటనే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. హుమారియా కర్జీ నేరుగా త్రో చేయడంతో కుదురుకున్న ఎలిసా పెర్రీ (13) రనౌట్గా వెనుదరిగింది. దాంతో, 71 రన్స్ వద్ద ఐదో వికెట్ పడింది. అంతకుముందు హేలీ మ్యాథ్యూస్ ఒకే ఓవర్లో మంధాన (23), హీథర్ నైట్ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టింది.
ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. 39 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. రీచా ఘోష్, కనికా ఆహుజా క్రీజులో ఉన్నారు. కష్టాల్లో పడిన ఆర్సీబీని వీళ్లు ఆదుకున్నారు. ఆరో వికెట్కు 31 రన్స్ జోడించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 102 రన్స్ చేసింది. గత మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముంబై ఇండియన్స్కు బ్రేక్ ఇచ్చింది.