RCB : ఐపీఎల్ 17వ సీజన్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangaluru) టైటిల్ కల నెరవేరేలా కనిపించడం లేదు. ‘ఈ సాలా కప్ నమదే థీమ్’తో బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడింది. ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములతో 9వ స్థానంలో నిలిచిన బెంగళూరు తర్వాతి పోరులో ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది.
ఈ మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు అక్కడి సిద్ధి వినాయకుడి(Sidhi Vinayaka) దర్శనం చేసుకున్నారు. తమ జట్టును గెలుపు బాట పట్టించాలని ఆర్ధించి..స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న వాళ్లలో మహిపాల్ లొమ్రోర్, పేసర్ విజయ్ కుమార్, సుయాశ్ ప్రభుదేశాయ్లు ఉన్నారు.
RCB players at the Shree Siddhivinayak Temple for the blessings of Lord Ganesha. pic.twitter.com/xZegZwp6z8
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2024
ఐపీఎల్లో ఒక్కసారి కూడా కప్పు కొట్టని ఆర్సీబీ ఈసారి కూడా ట్రోఫీపై ఆశలు వదిలేసుకున్నట్టే ఉంది. విరాట్ కోహ్లీ ఒంటరి సైనికుడిలా పోరాడుతున్నా.. సహచరులన నుంచి స్పందనే కరువైంది. దాంతో, డూప్లెసిస్ సేన హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. పంబాజ్ కింగ్స్పై కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఫినిషర్ దినేశ్ కార్తిక్(28 నాటౌట్) మెరుపులతో బోణీ కొట్టిన బెంగళూరు ఆ తర్వాత ఫ్లాప్ షోతో చతికిలపడుతోంది.
ఇకపై ప్రతి మ్యాచ్లో గెలిస్తే తప్ప ఆర్సీబీ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవడం కష్టం. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 11వ తేదీన ముంబై ఇండియన్స్తో బెంగళూరు తలపడనుంది. సొంత స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ను వణికించి పాయింట్ల ఖాతా తెరిచిన పాండ్యా సేనను ఆర్సీబీ ఏ మేరకు నిలువరిస్తుంది? అనేది చూడాలి.