Siricilla | రాజన్న సిరిసిల్ల : తమ బిడ్డలు ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటే.. తండ్రులు ఆగ్రహావేశాలకు లోనవుతారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదంటే హత్యలు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఈ తండ్రి మాత్రం ప్రేమ పెళ్లి చేసుకున్న తన కుమార్తె ఫ్లెక్సీకి నివాళులర్పించాడు. తన బిడ్డ చనిపోయిందంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష్ణ ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతుంది. అయితే తాను ప్రేమించిన యువకుడితో ఇటీవలే ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది అనూష్ణ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి మురళి.. తన బిడ్డ చనిపోయిందంటూ ఆమె ఫొటోతో ఓ ఫ్లెక్సీ తయారు చేయించాడు. జననం 03-01-2006.. మరణం 07-04-2024 అని రాయించాడు.
తన బిడ్డ తనను మోసం చేసిందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేశారు. ఇలాంటి బిడ్డల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు.. మీ కాళ్లు మొక్కుతా.. అని చిలువేరి మురళి రెండు చేతులు జోడించి వేడుకున్నాడు.
ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి
సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.
కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ… pic.twitter.com/6ulb1dCIad
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2024