MI vs RCB : ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 154కు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకే ఓవర్లో రెండేసి వికెట్లు తీయడంతో ఆ జట్టు కోలుకోలేక పోయింది. ఒకదశలో 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో అనిపించింది. అయితే.. రీచా ఘోష్ (28) కనికా ఆహుజా (22), శ్రేయాంక్ పాటిల్ (23) మంధాన (23) ఆ జట్టును ఆదుకున్నారు.
సాయికా ఇషక్ దెబ్బకు ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్(0) ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ముంబై బౌలర్లలో హేలీ హేలీ మ్యాథ్యూస్ మూడు, సాయిక్ ఇజాక్, అమెలియా కేర్ రెండు వికెట్లు తీశారు. పూజా వస్త్రాకర్, నాట్ సీవర్ బ్రంట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీకి. ఓపెనర్లు స్మృతి మంధాన, డెవినే శుభారంభం ఇచ్చారు. ఇసీ వాంగ్ వేసిన నాలుగో ఓవర్లో మంధాన చెలరేగింది. ఏకంగా మూడు బౌండీలు బాదింది. హేలీ మ్యాథ్యూస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మంధాన ఫోర్ డెవినే, సిక్స్ కొట్టడంతో 11 రన్స్ వచ్చాయి. దాంతో, ఆ జట్టు భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ, గత మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముంబై ఇండియన్స్కు బ్రేక్ ఇచ్చింది. డెవినేను ఔట్ చేసింది. దాంతో, 39 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. కష్టాల్లో పడిన ఆర్సీబీని రీచా ఘోష్ (28) , కనికా ఆహుజా (22) ఆదుకున్నారు. ఆరో వికెట్కు 31 రన్స్ జోడించారు.