మొహాలీ: రవీంద్ర జడేజా టెస్టుల్లో రెండవ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో.. ఇవాళ జడేజా ఆ ఫీట్ను అందుకున్నాడు. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్ల నష్టానికి 468 రన్స్ చేసింది. ఆల్రౌండర్ అశ్విన్, జడేజాలు ఏడో వికెట్ 130 రన్స్ భాగస్వామ్యానికి జోడించారు. బౌండరీలతో చెలరేగిన అశ్విన్ హాఫ్ సెంచరీ చేశాడు. 67 బంతుల్లో అతను టెస్టుల్లో 12వ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. 8 బౌండరీలతో 61 రన్స్ చేసిన అశ్విన్ లంచ్ బ్రేక్కు ముందు ఔటయ్యాడు. అయితే రెండో రోజు తొలి సెషన్లోనూ ఇండియా డామినేట్ చేసింది. ఈ సెషన్లో వికెట్ నష్టానికి 111 పరుగులు జోడించారు. లంక బౌలర్లు ఏ దశలోనూ ఇండియన్లను ఇబ్బందిపెట్టలేకపోయారు. రవీంద్ర జడేజా 102 రన్స్తో ఇంకా క్రీజ్లో ఉన్నాడు. అతని ఇన్నింగ్స్లో 10 బౌండరీలు ఉన్నాయి.