పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంలో జడేజా పాత్రను తక్కువ చేయలేం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ వెంట వెంటనే అవుటైన తర్వాత పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూ.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. ఈ క్రమంలోనే విలేకరుల సమావేశంలో మాట్లాడిన జడ్డూ.. తనపై వస్తున్న వదంతులపై స్పందించాడు. గాయంతో జడ్డూ వరల్డ్ కప్ ఆడటం లేదని వార్తలు వస్తున్నాయి. వీటిపై మీ స్పందన ఏంటి? అని జడ్డూను విలేకరులు అడిగారు.
‘‘నేను అసలు ఇలాంటి వార్తలు పట్టించుకోను. వరల్డ్ కప్లో నేను ఆడటం లేదనేది చాలా చిన్న రూమర్. ఆ మధ్య నేను చచ్చిపోయానని కూడా రూమర్స్ వచ్చాయి. అంతకన్నా పెద్ద వార్త ఉంటుందా? అందుకే వీటి గురించి నేను పట్టించుకోను. జస్ట్ వెళ్లి నా ఆట నేను ఆడుకుంటానంతే’’ అని జడ్డూ వివరించాడు.
Incredible win 😎
Excellent beginning 🇮🇳 pic.twitter.com/OTryERFSOs— Ravindrasinh jadeja (@imjadeja) August 29, 2022