ముంబై: వాంఖడే మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది. సోమవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై సీజన్లో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధోనీసేన45 పరుగుల తేడాతో నెగ్గింది. 189 పరుగుల లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్(49: 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ఒక్కడే రాణించగా మిగతా బ్యాట్స్మెన్ విఫలమవడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ(3/7), రవీంద్ర జడేజా(2/28), సామ్ కరన్(2/24) రాజస్థాన్ను దెబ్బకొట్టారు.
కెప్టెన్ సంజూ శాంసన్(1), మనన్ వోహ్రా(14), శివమ్ దూబే(17), డేవిడ్ మిల్లర్(2) విఫలమయ్యారు. అంతకుముందు డుప్లెసిస్(33: 17 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), మొయిన్ అలీ(26: 20 బంతుల్లో 1ఫోర్, 2ఫోర్లు), అంబటి రాయుడు(27: 17 బంతుల్లో 3సిక్సర్లు) విజృంభించడంతో 20 ఓవర్లలో చెన్నై 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో యంగ్ బౌలర్ చేతన్ సకారియా(3/36), క్రిస్ మోరీస్(2/33) అద్భుతంగా బౌలింగ్ చేశారు.