హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన వైద్యారోగ్య నిపుణుడు డాక్టర్ రాకేశ్ శర్మను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎన్బీఈ కొత్త బోర్డును ఏర్పాటుచేస్తూ బుధవారం గెజిట్ విడుదలచేసింది. బోర్డుకు అధ్యక్షుడిగా డాక్టర్ అభిజిత్ సేత్, సభ్యుల్లో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఉన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ దవాఖానల్లో సేవలందించిన రాకేశ్ శర్మ.. గతంలో ఎన్బీఈ అధ్యక్షుడికి ఓఎస్డీగా పనిచేశారు. అప్పుడే ఎన్బీఈలో పలు కీలక మార్పులకు కృషిచేశారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభు త్వం ఈ ఏడాది సర్ధార్ వల్లభాయి పటేల్ అవార్డుతో సత్కరించింది. ఈ అవకాశం లభించడం గర్వంగా ఉన్నదని డాక్టర్ రాకేశ్శర్మ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.