Ravi Shastri : భారత జట్టు ఈసారి ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)పై కన్నేసింది. సొంత గడ్డపై జరగనున్న వన్డే వరల్డ్ కప్(World Cup 2023)లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే.. టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో… జట్టు ఎంపిక, టైటిల్ ఫేవరెట్ల గురించి టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) తన అభిప్రాయం వెల్లడించాడు. ‘ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఓటమికి కారణాలు వెతికినట్టే వరల్డ్ కప్ విషయంలో చేయొద్దు.
ఎందుకంటే.. ? టోర్నీకి బృందాన్ని ఎంపిక చేసేందుకు చాలినంత సమయం ఉంది. జట్ట కూర్పు పక్కాగా కుదిరితే భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగడ ఖాయం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్టు కూడా ఫేవరెట్లు’ అని ఈ వరల్డ్ కప్ హీరో తెలిపాడు. అంతేకాదు వరల్డ్ కప్ లేదా డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవాలంటే స్టార్ ఆటగాళ్లు సెంచరీ కొట్టాలని అతను అన్నాడు.
2011లో వరల్డ్ కప్ ట్రోఫీతో భారత ఆటగాళ్ల సంబురం
ఈ ఏడాది భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5న తొలి మ్యాచ్ ఉంది. 2011లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది. ఇప్పటికే 11 ఏళ్లు టీమిండియా విశ్వవిజేతగా నిలిచి. పలుమార్లు ఐసీసీ ఫైనల్స్కు చేరినా ఓటమి వెక్కిరించింది. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) ఆడినా టెస్టు గదను దక్కించుకోలేకపోయింది. దాంతో, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. వరల్డ్ కప్ టోర్నీకి ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. ఆఖరి రెండు స్థానాల కోసం మాజీ చాంపియన్లు వెస్టిండీస్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. జింబాబ్వలో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు వరల్డ్ కప్ బరిలో ఉంటాయి.