MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhon)కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. మైదానంలోనే కాదు బయట కూడా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ మిస్టర్ కూల్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ ఏం చేశాడో తెలుసా..? విమానంలో ఎకానమీ క్లాస్లో వెళ్తూ ఎంచక్కా క్యాండీ క్రష్(Candy Crush) ఆడుతున్నాడు. అంతలోనే ఒక ఎయిర్హోస్టెస్(Air Hostess ) అతడికి దగ్గరకు వచ్చింది. డెయిరీ మిల్క్, ఇతర రకాల చాక్లెట్లు ఆఫర్ చేసింది. ఆమెను చూసి చిన్నగా నవ్విన ధోనీ.. చిన్నచాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాడు.
ఇదంతా ఒక ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్లో పెట్టాడు. వీడియో చూసిన అభిమానులు ధోనీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ‘మిగతా క్రికెటర్లు బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తారు. కానీ, తాలా మాత్రం ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాడు. సాదాసీదాగా ఉంటాడనే దానికి ధోనీ నిజమైన ఉదాహారణ’ అని కామెంట్లు పెడుతున్నారు.
MS Dhoni – the crowd favourite. pic.twitter.com/ltpud9P9Jj
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో ధోనీ తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఆ పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతోనే చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్లో రవీంద్ర జడేజా (11 నాటౌట్) సంచలన ఆటతో చెన్నైకి కప్పు అందించాడు. దాంతో, ధోనీ సేన ఐదో సారి ఐపీఎల్ చాంపియన్గా అవతరించి ముంబై ఇండియన్స్ రికార్డు సమం చేసింది. ఫైనల్ తర్వాత ధోనీ ముంబైలో మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయ్యాక ఫ్యామిలీతో కలిసి సొంత రాష్ట్రం జార్ఘండ్కు వచ్చేశాడు. పదహారో సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన ధోనీ 182.45 స్ట్రైక్ రేటుతో 104 పరుగులు చేశాడు. ఆడింది కొన్ని బంతులే అయినా ధనాధన్ ఆటతో ఫ్యాన్స్ను అలరించాడు.