Ravi Shastri : దక్షిణాఫ్రికా పర్యటనను భారత జట్టు(Team India) విజయంతో ముగించింది. సిరీస్ డిసైడర్ అయిన కేప్టౌన్ టెస్టు(Kape Town Test)లో రోహిత్ సేన చిరస్మరణీయ విజయంతో సిరీస్ సమం చేసింది. అయితే.. ‘మరో మ్యాచ్ ఉండి ఉంటే టీమిండియా సిరీస్ కచ్చితంగా గెలిచేది’ అని కోట్లాది మంది అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు నిట్టూర్చారు. భారత మాజీ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri )అయితే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను తప్పుపట్టాడు.
‘రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్తో టైమ్ వేస్ట్ తప్ప ఒరిగేదేమీ లేదు. అందుకని భవిష్యత్తులో టీమిండియా ఏ జట్టుతోనైనా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు అంగీకరించొద్దు’ అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 1983లో వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో సభ్యుడైన రవి శాస్త్రి భారత కోచ్గా నాలుగేండ్ల పాటు సేవలందించాడు.
సిరీస్తో దక్షిణాఫ్రికా, భారత ఆటగాళ్లు
వరల్డ్ నంబర్ 1గా దక్షిణాఫ్రికాపై గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన సెంచూరియన్(Centurion)లో భంగపడింది. డీన్ ఎల్గర్ శతకానికి తోడు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే.. సిరీస్ డిసైడర్ అయిన కేప్టౌన్లో భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా సంచలన బౌలింగ్తో సఫారీలకు చెమటలు పట్టించారు.
దాంతో, రోహిత్ శర్మ బృందం రెండో రోజే 7 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. న్యూలాండ్స్ (New Lands) మైదానంలో తొలి టెస్టు విజయం నమోదు చేసిన ఆసియా జట్టుగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు 12 కీలక పాయింట్లు సాధించిన భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-25 పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.