లండన్: దుబాయ్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత.. భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఓవల్లో నాలుగవ టెస్టుకు ముందు ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కోవిడ్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఇద్దరు టీమిండియా సిబ్బందికి కూడా వైరస్ సంక్రమించింది. దీంతో రవిశాస్త్రిపై విమర్శలు వచ్చాయి. ఎవరైనా ఆహ్వానించిన తర్వాత.. అక్కడే ఎక్కువ కాలం ఉండవద్దని రవిశాస్త్రి చెప్పారు. తాను ఏం సాధించాలనుకున్నానో, అవిన్నీ సాధించినట్లు ఆయన అన్నారు. టెస్టు క్రికెట్లో ఇండియాను అయిదేళ్ల పాటు నెంబర్ వన్ స్థానంలో ఉంచినట్లు చెప్పారు. ఆస్ట్రేలియాను తన స్వంత దేశంలో రెండు సార్లు ఓడించామని, ఇంగ్లండ్తో సిరీస్లోనూ లీడ్ ఉన్న విషయాన్ని మైఖేల్ అర్థటన్కు చెప్పినట్లు రవిశాస్త్రి గుర్తు చేశారు. టెస్టుల్లో అన్ని దేశాలపై విజయం సాధించామని, ఇక టీ20 వరల్డ్ కప్ గెలిస్తే అద్భుతమే అని, అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించినట్లు రవిశాస్త్రి చెప్పారు.
కోవిడ్ పాజిటివ్ తేలిన రవిశాస్త్రి.. ఇంగ్లండ్లో పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉన్నారు. ఆ పది రోజుల్లో తనకు ఎటువంటి లక్షణాలు లేవని, కేవలం గొంతు నొప్పి ఒక్కటే ఉండేదని చెప్పారు. అధిక టెంపరేచర్ కూడా లేదన్నారు. తన ఆక్సిజన్ ఎప్పుడూ 99 శాతం చూపించిందన్నారు. ఐసోలేషన్లో ఉన్న పది రోజుల పాటు తానేమీ మందులు వాడలేదన్నారు. కనీసం ఒక్క పారాసిటమాల్ కూడా వేసుకోలేదన్నారు. రెండు డోసుల టీకాలు వేసుకుంటే, ఆ పది రోజులు కేవలం ఫ్లూమాత్రమే ఉంటుందని శాస్త్రి తెలిపారు.