హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, యడ్లపల్లి ప్రాంజల, బవిశెట్టి సౌజన్య సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో రష్మిక 7-6(4), 6-4 తేడాతో అకాంక్ష పై అలవోక విజయం సాధించింది. టోర్నీలో తనదైన జోరు కనబరుస్తున్న రష్మిక టైటిల్కు మరో రెండడుగుల దూరం లో నిలిచింది. మరో క్వార్టర్స్లో నాలుగో సీడ్ ప్రాంజల 6-7(3), 6-4, 6-4తో వైదే హి చౌదరిపై విజ యం సాధించి ముం దంజ వేసింది. రాష్ర్టానికే చెందిన సౌ జన్య 6-0, 6-4తో లీ పై గెలిచింది. శనివారం సెమీఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి.