హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది. శనివారం మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-1, 6-2తో సోహా సాదిక్, అకాంక్ష జంటపై అలవోక విజయం సాధించింది.
మ్యాచ్ మొదటి నుంచే తమదైన దూకుడు కనబరిచిన రష్మిక జోడీ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. మరోవైపు సింగిల్స్ సెమీఫైనల్లో రష్మిక 3-6, 2-6తో అనస్తషియా సుకోతినా(రష్యా) చేతిలో ఓటమిపాలైంది.