Ranji Trophy 2024 | రంజీ ట్రోఫీలో ఫైనల్ రేసు రసవత్తరంగా మారుతోంది. రెండో సెమీస్ను మూడు రోజుల్లోనే ముగించి 48వ సారి ఫైనల్ చేరిన జట్టుగా ముంబై రికార్డులకెక్కగా.. అజింక్యా రహానే అండ్ కో. తో ఢీకొనే టీమ్పై ఆసక్తి నెలకొంది. విదర్భ – మధ్యప్రదేశ్లు ఫైనల్ రేసు కోసం హోరాహోరి తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లూ బ్యాటింగ్లో విఫలమవగా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం విదర్భ నిలబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ.. 90 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 343 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భకు ఇప్పటికే 261 పరుగుల ఆధిక్యం దక్కింది.
మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 13/1తో వచ్చిన విదర్భ.. మరో నాలుగు పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. కానీ ఓపెనర్ ధ్రువ్ షోరే (40), అమన్ మోర్ఖాడే (59)లు నాలుగో వికెట్కు 73 పరుగులు జోడించారు. ఐపీఎల్లో ముంబై తరఫున ఆడే స్పిన్నర్ కుమార్ కార్తీకేయ ఈ జోడీని విడదీశాడు. ఐదో స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ (38) క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. కానీ యశ్ రాథోడ్ (97 బ్యాటింగ్), కెప్టెన్ అక్షయ్ వాడేకర్ (77)లు ఆరో వికెట్కు 158 పరుగుల కీలక భాగస్వామ్యం జతచేశారు.
A splendid 158-run stand between Yash Rathod (97*) and Akshay Wadkar (77) has spearheaded Vidarbha’s brilliant fightback
They move to 343/6 at stumps on Day 3, leading by 261 in the 2nd innings@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1
Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/To2kZYmvwo
— BCCI Domestic (@BCCIdomestic) March 4, 2024
నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్.. తొలి రెండు రోజులు బౌలింగ్కు అనుకూలించగా మూడో రోజు మాత్రం బ్యాటింగ్కు అనుకూలించింది. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో చెలరేగగా రెండో ఇన్నింగ్స్లో మాత్రం 18 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించిన విదర్భ.. నాలుగో రోజు 300 ప్లస్ లక్ష్యాన్ని నిర్దేశిస్తే తప్ప ఆ జట్టు విజయం అంత ఈజీ కాదు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ముంబైతో ఫైనల్ ఆడనుంది.