RR vs MI : ముంబై, రాజస్థాన్ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. పవర్ ప్లే ముగిశాక స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో వాన మొదలైంది. దాంతో, అంపైర్లు మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. అప్పటికీ రాజస్థాన్ వికెట్ పడకుండా 61 రన్స్ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(31), జోస్ బట్లర్(28)లు ధనాధన్ ఆడుతున్నారు.
ముంబై నిర్దేశించిన 180 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు దంచారు. బుమ్రా మినహా అందర్నీ ఉతికేస్తూ స్కోర్ బోర్డును ఉరికించారు. ఈ సీజన్లో తొలిసారి యశస్వీ, బట్లర్లు 50పైగా రన్స్ జోడించారు. రాజస్థాన్ విజయానికి ఇంకా 84 బంతుల్లో 119 పరుగులు కావాలి.