హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ 20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్, హైదరాబాద్ ఈ-చాంపియన్స్ మూడో విజయాన్ని అందుకున్నాయి. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ రంగారెడ్డి.. 6 వికెట్ల తేడాతో పాలమూరు స్ట్రైకర్స్ను చిత్తుచేసింది. స్రైకర్స్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని రైజర్స్.. 14 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. అవనీశ్ రావు (50), జ్ఞానప్రకాశ్ రెడ్డి (47) రాణించారు. అంతకుముందు హైదరాబాద్.. 46 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను ఓడించింది.