ఇస్లామాబాద్: పాకిస్థాక్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్గా మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరిగినట్లు బోర్డు ఓ లేఖలో తెలిపింది. పీసీబీ 36వ చైర్మ్ను ఎన్నుకునేందుకు.. లాహోర్లోని నేషనల్ హై పర్ఫార్మెన్స్ సెంటర్లో జరిగిన సమావేశంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్తో ప్రత్యేక మీటింగ్ జరిగింది. మాజీ జస్టిస్ షేక్ అజ్మత్ సయీద్ నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా తనను ఎన్నుకున్నందుకు రమీజ్ రాజా థ్యాంక్స్ తెలిపారు. పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్లో పాజిటివ్ దృక్పథాన్ని నింపేందుకు ప్రయత్నిస్తానన్నారు. మైండ్సెట్ను, ప్రవర్తనా విధానంపై ఫోకస్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టుకు గతంలో కెప్టెన్గా బాధ్యతలు అందించిన రమీజ్ రాజాకు పోటీగా ఎవరూ నిలువలేదు. దీంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత గత నెలలోనే మాజీ చైర్మెన్ ఎహసాన్ మణి ఆ పోస్టు నుంచి తప్పుకున్నారు. దీంతో రమీజ్ ఎన్నిక జరిగింది. ఇటీవలే తాత్కాలిక కోచ్లుగా నియమితులైన సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్లు కూడా ఈ మీటింగ్కు హాజరయ్యారు.