కోల్కతా: రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్కు జరిమానా పడింది. గురువారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లీగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బట్లర్ మ్యాచ్ ఫీజులో పదిశాతం జరిమానా విధించారు.
ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐపీఎల్ నియామవళి ఆర్టికల్ 2.2ను అనుసరించి బట్లర్ లెవల్-1 తప్పిదానికి పాల్పడ్డాడు.