ముంబై : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. స్టాండ్బై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్విని ఎంపిక చేశారు.
జూన్ 2-3 తేదీలలో రుతురాజ్ వివాహం జరుగనున్నందున అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. యశస్వి ఆదివారం లండన్ బయలుదేరి వెళ్లాడు.