IPL 2023 : ఐపీఎల్ రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) భారీ స్కోర్ చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders, ) ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భానుక రాజపక్సే (50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ శిఖర్ ధావన్(40), ఓపెనర్ ప్రభ్సింహ్ రానా సింగ్ (23) వికెట్ కీపర్ జితేశ్ శర్మ(21), సికిందర్ రజా (16) రాణించారు. ఆఖర్లో ఆల్రౌండర్ సామ్ కరన్(26), షారుఖ్ ఖాన్(11) దంచి కొట్టడంతో పంజాబ్ 191 రన్స్ చేయగలిగింది. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ రెండో వికెట్లు తీశాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 23 రన్స్ వద్ద ఓపెనర్ వికెట్ కోల్పోయింది. ప్రభ్సింహ్ రానా సింగ్ (23)ను సౌథీ బౌట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్తో జత కలిసిన భానుక రాజపక్సే స్కోర్ వేగం పెంచాడు. కేవలం 30 బంతుల్లోనే రెండు సిక్స్లు, ఐదు ఫోర్లతో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్కు 86 రన్స్ జోడించారు. ఆ వెంటనే ధవన్ను చక్రవర్తి బౌల్డ్ చేశాడు. అయితే.. జితేశ్ శర్మ, రజా, కరన్ ధాటిగా ఆడి స్కోర్బోర్డును 190 దాటించారు.