IND vs WI : భారత్(India), వెస్టిండీస్(West Indies) మధ్య జరుగుతున్న కీలకమైన రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 24.1 ఓవర్ వద్ద చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. 113/5. విండీస్ తక్కువ అంచనా వేసిన భారత బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో, మన జట్టు ఆట మొదటి వన్డేలో విండీస్ను తలపించింది. తొలి వన్డేలో తేలిపోయిన విండీస్ ఆటగాళ్లు ఈ మ్యాచ్లో అద్భుత ఫీల్డింగ్తో ఆకట్టుకున్నారు.
తొలిసారిగా విరాట్ కోహ్లీ(Virat Kohli), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. శుభారంభం దక్కినా ఉపయోగించుకోలేకపోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(55) రెండో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే.. శుభ్మన్ గిల్(34), ఇషాన్ జోడీని గుడకేశ్ మోతీ విడదీశాడు. అక్కడితో వికెట్ల పతనం మొదలైంది. విండీస్ బౌలర్ల ధాటికి సంజూ శాంసన్(9), అక్షర్ పటేల్(1), హార్దిక్ పాండ్యా(7) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. శాంసన్ ఔట్ కాగానే సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. కానీ, అప్పటికే వాన మొదలవ్వడంతో ఇరుజట్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాయి.