ODI World Cup : మహిళల వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో షురూ కానుంది. ఇప్పటికే అన్ని జట్లు మెగా టోర్నీ సన్నద్ధతను ప్రారంభించాయి. అయితే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి జరుగుతున్న వామప్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో శనివారం భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ నిలిపివేశారు. వర్షం పడే సమయానికి 16.5 ఓవర్లకు కివీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. శుభారంభం ద్వారా టీమిండియా బౌలర్లను ఒత్తిడిలో పడేయాలనుకున్న కివీస్ ఓపెనర్లకు క్రాంతి గౌడ్ (2-31) షాకిచ్చింది. జార్జియా పిమ్మర్(4)ను ఔట్ చేసిన క్రాంతి.. కాసేపటికే ధనాదన్ ఆడుతున్న సుజీ బేట్స్(19)ను ఎల్బీగా వెనక్కి పంపింది. 38కే రెండు కీలక వికెట్లు పడడంతో కెప్టెన్ సోఫీ డెవినె(38 నాటౌట్), అమేలియా కేర్(22)లు జాగ్రత్తగా ఆడారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికించారిద్దరూ. అయితే.. వర్షం అంతరాయం కలిగించే సమయానికి మూడో వికెట్కు డెవినె, కేర్ ద్వయం 53 పరుగులు జోడించింది.
Home is where the heart is 💙
What it means to play the ICC Women’s Cricket World Cup 2025 at Home 🏡
Hear it from the #WomenInBlue 👌👌 – By @mihirlee_58
Show your support for #TeamIndia and grab your #CWC25 tickets now 👉 https://t.co/vGzkkgwXt4 pic.twitter.com/kx2mxA5Pju
— BCCI Women (@BCCIWomen) September 27, 2025