సిడ్నీ: వర్షం అంతరాయం మధ్య యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు బుధవారం మొదలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకున్న కంగారూలు క్లీన్స్వీప్ లక్ష్యంగా దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో సిడ్నీ టెస్టులో వరుణుడు ఆటంకం కల్గించినా..ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. ఓపెనర్లు వార్నర్(30), హారిస్(38) జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే డ్రైవ్ ఆడే ప్రయత్నంలో వార్నర్..బ్రాడ్(1/34)కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆరు పరుగుల తేడాతో హారిస్, లబుషేన్(28) ఔట్ కావడంతో ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది.