IND vs ENG | వర్షం కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో రోజు మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. రెండో సెషన్లో వెలుతురు తగ్గిపోవడంతో పాటు వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ 46.1 ఓవర్లకు 4 వికెట్ల నష్టంతో 124 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 57 పరుగులు ), రిషబ్ పంత్ ( 7 పరుగులు) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఇంకా 58 పరుగుల వెనుకంజలో ఉంది.