టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ల రేసులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో రాహుల్ తొలిసారి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. ఇటీవల క్లబ్హౌస్లో రెడ్బుల్ క్రికెట్ రూంలో మాట్లాడిన రాహుల్.. ఆరోజు ఉదయం జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నాడు.
రెండో టెస్టు కోసం బస్సులో ఉండగా కోహ్లీ తన వద్దకు వచ్చి, ‘‘నా వీపు కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు కెప్టెన్సీ చేయాల్సి రావచ్చు’’ అని చెప్పాడని రాహుల్ వెల్లడించాడు. అందరిలాగే అది తనకు చాలా సర్ప్రయిజింగ్గా అనిపించిందని, కానీ ఆడేవాళ్లం అంతా ఎవరికి వారే కెప్టెన్లలా ఆలోచిస్తామని కాబట్టి పెద్దగా తేడా అనిపించలేదని చెప్పాడు. కానీ జట్టులో కెప్టెన్ హోదా అందుకోవడం చాలా అద్భుతమైన అనుభవమని, అందరికీ ఆ అవకాశం రాదని అన్నాడు.
జట్టుకు నాయకత్వం వహించడాన్ని చాలా ఎంజాయ్ చేశానని వివరించాడు. అయితే ఆ టెస్టులో భారత జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత సఫారీ గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్కు కూడా రాహుల్ కెప్టెన్సీ వహించాడు. ఈ మూడు మ్యాచుల్లో కూడా భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.