హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాహుల్ రాధేశ్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లతో 101) వీరవిహారంతో టీజీ 20 లీగ్లో కరీంనగర్ డైమండ్స్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం ఉప్పల్లో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో ఆ జట్టు.. 133 పరుగుల తేడాతో మెదక్ ఫాల్కన్స్ను చిత్తుగా ఓడించింది.
మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్.. రాధేశ్ శతకానికి తోడు సహానీ (56) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 232 రన్స్ చేసింది. ఛేదనలో మెదక్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. తేజ (37) మినహా మిగిలినవారు డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేక చతికిలపడ్డారు. ఈ టోర్నీలో మెదక్కు ఇది నాలుగో పరాభవం.