టీ20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో ఇంటికొచ్చిన టీమిండియా.. విశ్వకప్లో ఫైనల్ చేరిన న్యూజిల్యాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతోంది. న్యూజిల్యాండ్ సిరీస్కు భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. భారత జట్టు దీర్ఘకాలిక లక్ష్యం ప్రపంచకప్ అని, దాని మీద కచ్చితంగా ఫోకస్ ఉంటుందని రాహుల్ చెప్పాడు.
అయితే అదే సమయంలో ఆడే ప్రతి సిరీస్ కూడా ముఖ్యమేనని అన్నాడు. ప్రపంచకప్ కోసం కావలసిన కాంబినేషన్లు ట్రై చేస్తామని, అయితే ఏ సిరీస్ జరిగే సమయంలో దానిమీదనే ఫోకస్ పెడతామని రాహుల్ తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు టీ20 సారధ్య బాధ్యతలకు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో న్యూజిల్యాండ్ సిరీస్కు టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను నియమించారు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ తదితర సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. ఆ తర్వాత కివీస్తో రెండు టెస్టులు జరగనున్నాయి. వీటిలో రోహిత్కు విశ్రాంతినిచ్చారు.
తొలి టెస్టులో టీమిండియాకు రహానే నాయకత్వం వహిస్తాడు. రెండో టెస్టు నాటికి కోహ్లీ జట్టుతో చేరతాడు. ఆ మ్యాచ్లో జట్టుకు కోహ్లీనే సారధ్య బాద్యతలు వహించనున్నాడు.