kolkata test 2001: కోల్కతాలోని ఈడెన్స్ గార్డెన్ (Edens Garden)లో భారత జట్టు ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన రోజును భారత భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఓటమి ఖాయం అనుకున్న దశలో టీమిండియా మ్యాచ్ గెలిచిందంటే.. అందుకు కారణం ఇద్దరే. ఈ మ్యాచ్లో వీవీఎస్.లక్ష్మణ్ (VVS Laxman), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడారు. దాంతో, నాలుగో రోజు టీమిండియా అనూహ్యంగా గెలిచింది. భారత టెస్టు క్రికెట్ సత్తాను ప్రపంచానికి చాటిన ఈ రోజుకు నేటికి 22 ఏళ్లు.
2001 మార్చి 14న టీమిండియా టెస్టు క్రికెట్లో గుర్తుండిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్భంగా బీసీసీఐ ట్విట్టర్లో లక్ష్మణ్, ద్రవిడ్ అభివాదం చేస్తున్న ఫొటో షేర్ చేసింది. ‘ఒక అద్భుతమైన ప్రదర్శన. ఆస్ట్రేలియాపై ఈడెన్స్ గార్డెన్లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు అసాధారమైన ఇన్నింగ్స్ ఆడారు’ అని పోస్ట్ పెట్టింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య కోల్కతాలోని ఈడెన్స్ గార్డెన్లో మార్చి 11న రెండో టెస్టు మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా (110) సెంచరీ, మాథ్యూ హేడెన్ (97) హాఫ్ సెంచరీ కొట్టడంతో 445 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 171 రన్స్కే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడింది. తొలి ఇన్నింగ్స్లో లక్ష్మణ్ (59) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రెండో ఇన్నింగ్స్లో లక్ష్మణ్, ద్రవిడ్ అడ్డు గోడలా నిలబడ్డారు. ఆసీస్ బౌలర్లను పరీక్షిస్తూ లక్ష్మణ్ (281) డబుల్ సెంచరీ, ద్రవిడ్ (180) సెంచరీతో చెలరేగారు. వీళ్లిద్దరూ ఐదో వికెట్కు రికార్డు స్థాయిలో 3756 పరుగులు సాధించారు. భారత్ 657/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆసీస్ 212 రన్స్కే ఆలౌట్ అయింది. హర్భజన్ సింగ్ రెండు ఇన్నింగ్స్ల్లో 13 వికెట్లు తీసి ఆసీస్ను దెబ్బ కొట్టాడు. దాంతో 171 రన్స్ తేడాతో టీమిండయా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విలువైన ఇన్నింగ్స్ ఆడిన హైదరబాదీ సొగసరి బ్యాటర్ లక్ష్మణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.
🗓️ #OnThisDay in 2001
A stupendous show, ft. @VVSLaxman281 & Rahul Dravid as #TeamIndia made a sensational comeback against Australia at the Eden Gardens, Kolkata 👏 👏 pic.twitter.com/YLAOp0yCxC
— BCCI (@BCCI) March 14, 2023