Rahul Dravid : వెస్టిండీస్తో వన్డే సిరీస్(Westindies ODI Series)లో ప్రయోగాలు బెడిసికొట్టాయి. కుర్రాళ్లతో కూడిన జట్టు రెండో వన్డేలో ఈజీగా గెలుస్తుందనుకుంటే దారుణంగా ఓటమి పాలైంది. దాంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వన్డే సిరీస్లో బ్యాటింగ్ ఆర్డర్లు మార్చడం, విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)ను పక్కనపెట్టడంపై భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఆసక్తికర సమాధానం చెప్పాడు. ‘కొంతమంది ఆటగాళ్లను పరీక్షించేందుకు విండీస్ సిరీస్ మాకున్న చివరి అవకాశం. అదుకని వన్డే సిరీస్లో ప్రయోగాలు చేశాం.
కొందరు ఆటగాళ్లు గాయాలపాలై, నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)లో ఉన్నారు. మరో నెల రోజుల్లో ఆసియా కప్(Asia Cup) ఉంది. వాళ్లలో కొందరు ఆసియా కప్, వలర్డ్ కప్(World Cup) సమయానికి కోలుకుని, ఫిట్నెస్ సాధిస్తారిని ఆశిస్తున్నా. ఆలోపు ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం’ అని ద్రవిడ్ తెలిపాడు. అంతేకాదు వన్డేల్లో తరచూ విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్(SuryaKumar Yadav)ను ద్రవిడ్ వెనకేసుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్
‘సూర్య మంచి ఆటగాడు. అందులో ఏ సందేహం లేదు. టీ20 క్రికెట్, దేశవాళీ క్రికెట్లో అతను సత్తా చాటాడు. అయితే.. టీ20ల్లో ఆడినంత దూకుడుగా వన్డేల్లో ఆడలేకపోతున్నాడు. సూర్య ఇప్పుడిప్పుడే వన్డేలకు అలవాటు పడుతున్నాడు’ అని ద్రవిడ్ వెల్లడించాడు. టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన సూర్య రెండు వన్డేల్లో 19, 24 పరుగులతో మరోసారి విఫలయమ్యాడు.
ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఒక్కడే రెండు వన్డేల్లో అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో దుమ్మురేపిన శుభ్మన్ గిల్ మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. కష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో, భారత జట్టు 181 పరుగులకు కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి ఛేదించి సిరీస్ సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే ఆగస్టు 1న జరుగునుంది.