లండన్: 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్లో వరుసగా ఆరు బంతులను సిక్సర్లుగా మలిచి రికార్డు సృష్టించాడు. అయితే, అది స్టువర్ట్ బ్రాడ్ కెరీర్లో ఓ చెత్త రికార్డుగా మిగిలిపోయింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ఆఖరి టెస్టు మూడో రోజు ఆట ముగిసిన అనంతరం స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా 2007 వరల్డ్ కప్లో తన బౌలింగ్లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆ రోజు యువరాజ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టడం వల్లే తాను కెరీర్ ఈ స్థాయికి ఎదిగానని స్టువర్ట్ బ్రాడ్ చెప్పారు. ఏదేమైనా తన కెరీర్లో అదో చేదు జ్ఞాపకమని, వాస్తవానికి తాను అలా జరగకూడదు అనుకున్నానని, కానీ జరిగిందని పేర్కొన్నారు. కాగా, 37 ఏళ్ల స్టువర్ట్ బ్రాడ్ ప్రస్తుతం 602 వికెట్లతో ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్గా ఉన్నాడు.