Asia Cup 2023 : వరల్డ్ కప్(ODI WC 2023) ముందు టీమిండియాను స్టార్ ఆటగాళ్ల ఫిట్నెస్ వేధిస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకుంటున్న కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శస్త్రచికిత్సల అనంతరం కోలుకొని అంతర్జాతీయ మ్యాచుల్లో సత్తా చాటడం సవాలుతో కూడుకున్నది అన్నాడు. అయితే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. గాయాలతో జట్టుకు దూరమైన ఆటగాళ్లకు స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో అవకాశం ఇస్తామని వెల్లడించాడు.
‘కొంత మంది ప్లేయర్లు గాయాల నుంచి కోలుకొని తిరిగి రానున్నారు. వాళ్లకు అవకాశాలు ఇస్తాం. ఆసియా కప్(Asia Cup) ప్రారంభానికి ముందు ఆగస్టు 23 నుంచి బెంగళూరులో క్యాంప్ నిర్వహిస్తాం. ఆ తర్వాత వారి గురించి ఆలోచిస్తాం’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. రాహుల్, అయ్యర్ ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రాహుల్, శ్రేయస్ కూడా ఆసియా కప్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే చాన్స్ ఉందని ద్రవిడ్ పేర్కొన్నాడు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. నాలుగైదు నెలల నుంచి ఆటకు దూరమైనప్లేయర్లను నేరుగా ఆసియా కప్ బరిలోకి దింపడం సాహసమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిట్నెస్ సాధించడం వేరు.. తీవ్ర ఒత్తిడి ఉండే అంతర్జాతీయ మ్యాచ్ల్లో పాల్గొనడం వేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్
ఆసియా కప్లో దాయాది పాకిస్థాన్తో ఒకటికి మించి మ్యాచ్లు ఆడే అవకాశం ఉన్న నేపథ్యంలో రిస్క్ అవసరమా? అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. వెస్టిండీస్ పర్యటన ద్వారా మిడిలార్డర్ కష్టాలు తీరుతాయనుకుంటే.. దానికి బదులు కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నౖట్లెంది. వన్డే సిరీస్లో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో మళ్లీ పాత ఆటగాళ్ల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది.