కామన్వెల్త్ క్రీడలలో భాగంగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది. ఫైనల్స్లో సింధు.. 21-15, 21-13తో మిచెలీ లీ (కెనడా)ను ఓడించి బంగారు పతకం సాధించింది. సింధు సాధించిన స్వర్ణం కామన్వెల్త్లో భారత్కు 200వ బంగారు పతకం కావడం విశేషం.
2022 కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కావడానికి ముందు భారత్.. 181 స్వర్ణాలతో ఉంది. పది రోజులుగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న పోటీలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో బంగారు పతకాలు నెగ్గారు. సింధు సోమవారం గెలిచిన స్వర్ణం 19వది. దీంతో భారత్కు 200వ స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్రలో తన పేరును సింధు సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
1930 నుంచి జరుగుతున్న కామన్వెల్త్ పోటీలలో భారత్ 1934 నుంచి పాల్గొంటున్నది. 1934లో భారత్కు చెందిన రెజ్లర్ రషీద్ అన్వర్ దేశానికి కాంస్యాన్ని అందించాడు. ఈ క్రీడలలో మనకు అదే తొలి పతకం. పతక బోణీ కొట్టినా దాని రంగును మార్చడానికి భారత్కు మరో 24 ఏండ్ల సమయం పట్టింది. 1958లో కార్డిఫ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్.. దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. అప్పట్నుంచి భారత్ ప్రతి కామన్వెల్త్ గేమ్స్ లో తన బంగారు పతకాల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నది.
కామన్వెల్త్ క్రీడలలో సింధు ప్రదర్శన ఇలా..
P V Sindhu – you never fail to amaze & truly are the epitome of girl power. Congratulations on yet another🥇.
This medal is all the more special as it marks India’s 200th Gold Medal in the history of CWG. @Pvsindhu1 – may you always continue to shine & make the Nation proud. pic.twitter.com/HgHMusyJbp
— Smriti Z Irani (@smritiirani) August 8, 2022