న్యూఢిల్లీ: భారత షట్లర్లకు కెనడా ఓపెన్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో యువ ఆటగాడు లక్ష్యసేన్ ఫైనల్లో అడుగుపెడితే.. మహిళల విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్లో పరాజయం పాలైంది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 పురుషుల సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 21-14తో కెంటా నిషిమోటో (జపాన్)పై నెగ్గాడు. మహిళల సెమీస్లో సింధు 14-21, 15-21తో ప్రపంచ నంబర్వన్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడింది.